అనంతపురంలో ఫ్యాక్షన్ మళ్లీ పడగ విప్పిందా అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. గత కొంత కాలంగా రాజకీయ హత్యలు జరుతుగున్నాయి, ప్రత్యర్థులను వెంటాడి మరీ దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్సాన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది,ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్న  ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు.

ఇది రాజకీయ కక్షా,లేక వ్యక్తిగత కక్షా అన్నది తెలియవలసి ఉంది. అనంతపురం జిల్లాలో ఇటీవలి కాలంలో మళ్లీ హత్యలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: