విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆరాటం..ఖరీదైన సెల్ఫోన్ల మోజులో పడి 13 ఏళ్ల వయసులోనే ఆ అమ్మాయి వ్యభిచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అసలు సమాజం ఎటువైపు పోతుంది టెక్నాలజీ మంచికి ఉపయోగించుకోవాల్సింది పోయి సర్వ నాశనానికి ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ లు ప్రతి ఒక్కరి కి అందు బాటులోకి వచ్చిన తర్వాత సమాజంలో వెర్రి వెయ్యింతలు పెరిగిపోయింది.
విలాసవంతమైన జీవితాలకోసం వ్యభిచారంలోకి యువతులు
సుభాన్పురా ఏరియాలో గ్రాసరీ దుకాణం నడుపుకునే తల్లి తన పదమూడేళ్ల కూతురు గర్భవతి అనే తెలుసుకొని షాకై అయింది ,కూతురు చెప్పిన కారణాలు విని నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమెకు విలాసంతమైన జీవితంపై మోజు పెరగడంతో డబ్బుల కోసం అనాలోచితంగా వ్యభిచార కూపంలోకి వెళ్లింది. ఆమెకు మంచి చెడు తెలిసే లోపే ఆమె జీవితాన్ని అంధకారంగా మారిపోయింది. దీంతో ఎలాగైనా ఆమెను దారిలో పెట్టాలనుకున్నతల్లి మేనమామగారింటికి పంపించివేసింది. కానీ ఆత్మహత్య చేసుకుంటానని కూతురు బెదిరించడంతో ఇక చివరి ప్రయత్నంగా .
విలాసవంతమైన జీవితాలకోసం పడుపు వృత్తిని నమ్ముకొని జైలు పాలైన యువతులు
గుజరాత్ లోని అభయం టోల్ఫ్రీ నెం. 185 ను సంప్రదించింది. ఫ్యామిలీ కౌన్సెలర్ కౌన్సెలింగ్లో ఈ వెలుగులోకి వచ్చింది. ఇలాంటి విలాస వంతమైన జీవితాలు గడపాలని చూసే అమ్మాయిలు ఈజీ మనీ కోసం వెతుకులాడే అమ్మాయిలు మగవాళ్ల ఉచ్చులో పడి పడుపు వృత్తిలోకి దిగిపోతున్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటున్నారు పోలీసులు.