ఈ రోజు  గండిపేటలలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో నందమూరి సోదరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే గత కొంత కాలంగా హరికృష్ణకు, బాలకృష్ణ ల మధ్య మాటలు లేవని వారి మధ్య పార్టీ పరంగా కొన్ని మనస్పర్థలు రావడంతో ఎవరికి వారే అన్న చందంగా ఉంటున్నాని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రోజు మహానాడు కార్యక్రమానికి సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు హరికృష్ణ, హీరో, హిందూపురం శాసన సభ్యులు బాలకృష్ణలు హాజరయ్యారు.

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ


అసలు మహానాడు కార్యక్రమానికి నందమూరి హరికృష్ణవస్తాడా అన్న ప్రశ్న తలెత్తింది.. కానీ అందరూ ఆశ్చర్య పోయేలా అన్నదమ్ములు ఒకే వేధిక పై కనిపించడంతో తెలుగు తమ్ములు ఆనంద పడ్డారు. హరికృష్ణ పార్టీలోని నేతలందరినీ పలుకరిస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వేదిక మీదకు వచ్చారు. గత ఎన్నికల్లో హరికృష్ణ.. చంద్రబాబు, బాలయ్యల పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హరి మహానాడుకు హాజరయ్యారు. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు దాదాపు తొలగినట్లేనని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: