మితిమీరిన డ్రైవింగ్ తో ఓ చిన్నారి ప్రాణం బలైపోయింది. ప్రముఖ సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో రాజస్థాన్ పోలీసులు వెంటనే ఎలర్టై ఆ కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ ను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 304 ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.గత రాత్రి మధుర నుంచి జైపూర్‌కు వెళుతుండగా... దౌసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ హేమమాలిని తీవ్రంగా గాయపడగా, ఓ నాలుగేళ్ల బాలిక దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.

ప్రమాదంలో నుజ్జు నుజ్జైన కారు


అనవసరమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే పోలీసులు ఎంపీ కారు డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొనడంతో ఆమె గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: