కాంగ్రెసు పార్టీ నాయకులు ఆనం సోదరులు జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. జిల్లాలోని ఇతర నేతల అభిప్రాయాలను కనుగొన్న తరువాత జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డిని సిఎం చేయాలంటూ తొలి సంతకాలు చేసిన వారిలో ఆనం సోదరులు ముందున్నారు.

బొత్స సత్యనారాయణతో పాటు ఆనం సోదరులు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు.కాంగ్రెస్ పార్టీలో ఇక భవిష్యత్తు ఉండబోదని విషయం సీనియర్ నాయకులందరికి మెల్లమెల్లగా అవగతం అవుతోంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మొదలు డీఎస్ వరకూ చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇప్పుడు ఆనం సోదరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో లేదో కూడా తెలియదు.


వైఎస్సాఆర్ సీపి


ఈనేపథ్యంలో ఆనం సోదరులు కూడా పార్టీ మారడానికే సముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే చాలా రోజులనుండి వీరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే చాలామంది విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అందరూ కలిసి జగన్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారేమో అని విమర్శించారు కూడా మరి నిజంగానే కాంగ్రెస్ నేతలందరూ కలిసి జగన్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: