భారత దేశంలో అత్యాచారాల పర్వం కోనసాగుతూనే ఉంది.. కేంద్ర ప్రభుత్వం నిర్భయ అత్యాచారం అనంతరం మహిళల రక్షణ కోసం ‘నిర్భయ’ చట్టాన్ని తీసుకువచ్చినా.. ఎంత మందిని అరెస్టు చేసి జైళ్లో పెట్టినా కొంత మంది మానవ మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లుగప్పి కొంతమంది యువకులు ఓ బాలికను అపహరించి రెండు రోజుల పాటు అతి దారుణంగా హింసించి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో ఓ బాలికను ఆరుగురు యువకులు అపహరించి ఒక ఇంట్లో నిర్భందించి ఒకరి తర్వాత ఒకరు పైశాచికంగా బాలికను అత్యాచారం చేశారు. ఎదురు తిరిగినందుకు కొట్టి హింసించి రెండు రోజుల అత్యారాచం చేశారు. నరకం అనుభవించిన ఆ బాలిక  చివరకు  వారి నుంచి ఎలాగో అలా తప్పించుకొని తల్లిందడ్రులకు విషయం చెప్పింది.. దీంతో వారు కొణిజర్ల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: