భారత దేశంలో అత్యంత హేయమైన సంఘటన.. ఢిల్లీకి చెందిన 23 యేళ్ల పారామెడికల్ వైద్య విద్యార్థిని 2012 డిసెంబర్ 13వ తేదీన జుగుప్సాకరమైన రీతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన తర్వాత 16 రోజుల పాటు మృత్యువుతో పోరాడి జీవన్మరణ పోరాటం చేసిన చనిపోయిన  విషయంతెల్సిందే..   సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ అత్యాచారం కేసు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష పడింది. అత్యంత దారుణానికి తెగబడ్డ నిర్భయ దోషులకు మరో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

అయితే ఇది ఒక దోపిడి కేసులో విధించిన శిక్ష. నిర్భయ ఘటనకు ముందు ఆ దారుణానికి పాల్పడ్డ దోషులు ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్, రాం సింగ్ లు ఓ కార్పెంటర్ పై దాడికి దిగి అతడిని నిలువుదోపిడీ చేశారు. దీనిని ఢిల్లీ పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఢిల్లీ అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి రితేష్ సింగ్ నిందితులు నలుగురికి ఒక్కక్కరికి విడివిడిగా పదేళ్ల జైలు శిక్ష విధించారు.

ఇక నిర్భయ కేసులో ఇప్పటికే వీరికి సెషన్స్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధించగా, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును వీరు ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు అపెక్స్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలావుంచితే, నిర్భయ కేసులో ఒకడైన రాంసింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: