భారత దేశంలో అమ్మాయిలకు అసలు భద్రత ఉందా అంటే రోజూ టీవీ చానల్లో...ప్రింట్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే.. లేదనే అనిపిస్తుంది. భారత ప్రభుత్వ నిర్భయ చట్టం తీసుకు వచ్చిన తర్వాత కొందరు కామాందులు నిర్భయంగా అత్యాచార పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా పంజాబ్‌లోని లుథియానా దారుణం చోటు చేసుకుంది. పంజాబ్ లోని లూధియానాకు చెందిన విద్యార్థిని స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా బుధవారం సాయంత్రం కిడ్నాప్నకు గురైంది.

కొందరు కామాందులు ఆ బాలికను  ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అనంతరం గ్యాంగ్ రేప్ చేసినట్లు సమాచారం. వారి కామ వాంచ తీరిన తర్వాత అ బాలికను అన్యాయంగా కొట్టి చంపేసి మృతదేహాన్ని కాలువలో పారేశారు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

శరీరంపై 17 గాయాలతో పాటు తల పగిలిఉంది. పదునైన ఆయుధంతో తలపై దాడిచేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాగా బాధిత విద్యార్థిని బంధువులు, కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని మృతదేహంతో వారు ఆందోళన చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: