సినిమాల్లో సాధారణంగా క్రైమ్,థ్రిల్లింగ్ సినిమాలు చూస్తుంటాం... మర్డర్ ప్లాన్ చేసే విలన్లను చూసి భయపడుతుంటాం.. కానీ అలాంటిదే నిజజీవితంలో జరిగింది.. అదే షీనా బోరా హత్య. ఇప్పుడు భారత దేశంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న న్యూస్ షీనా బోరా హత్య. ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్యకేసు ఓ కొలిక్కి వచ్చింది..షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తేలింది.

సంచనలం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య గురించి ఇంద్రాని పూస గుచ్చినట్లు చెబుతుంటే ముంబై పోలీసులకు ఖంగు తిన్నారు. తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని రాయగఢ్ ప్రాంతానికి ఏవిధంగా తరలించిందో వివరించినట్టు సమాచారం. షీనా చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత ఆ మృతదేహానికి తల దువ్వి, లిప్‌స్టిక్ వేసి, అత్తరు కొట్టి చక్కగా ముస్తాబు చేసి కారులో తీసుకువెళ్లానని చెప్పారు.

 స్టార్ ఇండియా మాజీ సీఈఓ భార్య ఇంద్రాణి ముఖర్జియా


ఎందుకు ఈవిధంగా చేసారన్న ప్రశ్నకు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఈ విధంగా చేశానని ఆమె సమాధానమిచ్చినట్టు ఓ అధికారి వెల్లడించారు.  చెడువాసన రాకుండా, కారులో రాయగఢ్‌కు తీసుకుని వెళ్తుండగా ఎవరికీ అనుమానం రాకుండా ఇంద్రాణి ఆ పనిచేసినట్లు భావిస్తున్నారు. రాయగఢ్‌కు తీసుకుని వెళ్లిన తర్వాత తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లతో తాము అనుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టి.. నిప్పంటించినట్టు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: