ఒక్కొక్కసారి అతితెలివి భలే దెబ్బతీస్తుంది, తాము తోవ్వుకున్న గోతిలో తామే పడ్డట్టు అయ్యింది బీజేపీ పరిస్థితి. రాష్ట్రం లో వెంకయ్య నాయుడు గారు అప్పట్లో వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు తలనొప్పిగా మారింది. విభజన జరిగిన వెంటనే చాలా తెలివి ఉపయోగించి తమ కి అనుకూలంగా ఉండే మీడియా సహాయం తో తెలంగాణా ని బీజేపీ నే ఇచ్చింది అన్న చెందంగా, కాంగ్రెస్ ఆంద్రా కి అన్యాయం చెయ్యబోతే అడ్డుకున్నాం, ఆ రాష్ట్రాన్ని ఆదుకున్నాం అంటూ డప్పుకొట్టించారు.

దీంతో భాజపా పరిస్థితి అయోమయంలో పడింది


అప్పట్లో జనాల మనసులో నాటుకుపోయిన ముఖ్య అంశం " ప్రత్యేక హోదా సాధించాం" అని. ఇది ఆంధ్ర జనాల మదిలో బాగా ఇరుక్కుంది. దాని ఫలితం బీజేపీ కి బొక్కబోర్లా పడే స్థాయి ఇవ్వగా తెలుగు దేశానికి బాగా కలిసొచ్చింది. తెలంగాణా జనం తెలంగాణా తెచ్చిన ఘనత విషయం లో బీజేపీ ని పెద్దగా నమ్మనేలేదు. ఇప్పుడేమో అప్పట్లో చెప్పిన కబుర్ల స్థానే వంకలు వచ్చి పడ్డాయి. హామీల సంగతి దేవుడు ఎరుగు రావాల్సిన ఫండ్స్ రావట్లేదు అంటూ ప్రజలు సీరియస్ గా ఉన్నారు.  దీంతో భాజపా పరిస్థితి అయోమయంలో పడింది. మోడీని అడగలేదు..ఇక్కడ జనానికి మొహం చూపించలేదు.


ఇప్పటికే వెంకయ్య నాయుడి చరిష్మా ఆంధ్ర జనంలో ఎంత పలుచన కావాలో అంతా అయింది. జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళో, హీరో శివాజీ లాంటి వాళ్ళో, రేప్పొద్దున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళో ఈ విషయం మీద దీక్షలో, ధర్నాలు , హడావిడి చేసినా నష్టం ఎవరికీ? ఖచ్చితంగా బీజేపీ నే ఈ ఇబ్బందులు ఎదురుకొంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.  చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు..గట్టిగా అడగగలరు అంతే. లేదా తన మంత్రులను రాజీనామా చేయించాలి.


అలా చేయించకున్నా చంద్రబాబుకు జనాల్లో వచ్చే అప్రతిష్ట కన్నా, హోదా ఇవ్వకపోవడం వల్ల ఇటు వెంకయ్యకు, అటు భాజపాకు వచ్చే తలకాయనొప్పి ఎక్కువ. ఇవ్వాల్సిన కేంద్రమే ఇవ్వకపోతే కేంద్రం ఉన్న భాజాపా ని తెలుగు రాష్ట్రాల తరఫునుంచీ రేప్రజంట్ చేస్తున్నారు వెంకయ్య. ఇప్పుడు ఇలాంటి జనాల విమర్సలనీ, ప్రతిపక్షాల ఎత్తుగాడలనీ తెలుగు దేశం ని తప్పించి తమ నేత్తిమీదకి తెచ్చుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: