పూర్వమొకానొక సమయంబున నొక గృహస్థునకు ఏడుగురు కుమారులు కలిగిరి. వారందరకును వివాహములు జరిగి కోడళ్ళు కాపురములకు వచ్చిన తరువాత విడిపోయి యెవరి కాపురములను వారు వేరువేరుగ చేసికొనుచుండిరి. వారిలో చివరివాడొకడే దరిద్రుడై యుండి మిలిగిన అన్నలు ఆరుగురును సిరిసంపదలతో తులతూగుచుండిరి.