హనుమంతుని మృదువైన మాటలు విన్న తరవాత సుగ్రీవుని మనస్సు సరిగ్గా ఆలోచించటం ప్రాంభించింది. సుగ్రీవుడు హనుమంతునితో "హనుమా! వారిని చూశావా! ఆజానుబాహువులు, విశాలమైన కళ్ళు కలవాళ్ళు, ధనుర్భాణములు, కృపాణములు ధరించి ఉన్నారు. వారిని చూస్తే ఎంతటివారిలైనా భయం కలుగుతుంది. బహుశా వారిద్దరూ మా అన్న వాలి చేత పంపించబడి ఉంటారు. అటువంటి శత్రువులను చూసి జాగ్రత్తపడటం అవసరం కాదంటావా? నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వారు ఇక్కడికెందుకు వచ్చారో? వారి మనసులో ఏముందో? మనం తెలుసుకోవాలి. నువ్వు వారితో మాట్లాడుతున్నంతసేపూ నీ ముఖం