ఆవుపాలు పసుపుపచ్చగా వుంటాయి. గేదె పాలు తెల్లగా ఉంటాయి. అందువల్ల వీటిని బంగారం, వెండి అంటారు. ఆవు మూపురంలో స్వర్ణనాడి ఉంటుంది. అందుకే ఈ ఆవుపాలలో స్వభావసిద్ధంగానే బంగారపు తత్వం ఇమిడి ఉంది. ఈ తత్వం మానవులకు అత్యంత మేలు కూర్చే అంశం.
ఆవు దూడ పుట్టిన మూడు రోజులకే గంతులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడి ఉంటుంది. ఈ కారణంగానే ఆవు పాలు తో శరీరంలో ఉషారు..స్పూర్ఫ్తి వస్తుందని చెప్పవచ్చు. అదే గేదె పాలవల్ల అలసత్వం వస్తుంది. 500 పశువుల మధ్యలో విడిచిపెట్టిన ఆవు దూడ తన తల్లి వద్దకు అవలీలగా చేరుకుంటుంది. అదే గేదె దూడ 10-15 గేదెల మధ్యలోనైనా తన తల్లిని గుర్తించలేదు. దీన్ని బట్టి మనం ఆవుపాలు బుద్దిబలం పెంచుతాయని అర్థం చేసుకొనవచ్చు. ఆవులకు గాని, వాటి దూడలకు గాని మనం ఏదైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే అవి ప్రతిస్పందించి పిలుస్తున్నవారి వద్దకు వస్తాయి. గేదెలకు, వాటి దూడలకు ఈ జ్ఞానం శున్యం. ఆవులు ఎక్కడ విడిచిన పెట్టిన సమయానికి మళ్లీ అవి తమ స్వస్థలానికి చేరుకొంటాయి. గేదెలకు స్థలము, సమయము, గుంపు అన్న గుర్తింపు ఉండదు.
భారతీయ గోవు తీవ్రమైన ఎండను కూడా సహిస్తుంది. అందుకే దీని పాలు రోగరహితము, ఆరోగ్యప్రదము, పౌష్టికమైనవిగా ఉంటాయి. కాని గేదెలు , విదేశీ జాతి జెర్సీ..ఇతర సంకరజాతి ఆవులు ఎండవేడిమిని సహించలేవు. ఆవు పాలు గుండె జబ్బు రోగులకు ప్రత్యేకించి ఉపయోగపడతాయి. గేదె పాలలోని క్రొవ్వు పదార్థం రక్తనాడుల్లో చేరి క్రమంగా హృద్రోగానికి కారణం అవుతాయి. ఆవు పాలలోని పసుపచ్చని పదార్థం కళ్ళలోని జ్యోతిని వృద్ధి పరుస్తుంది. కళ్ళకలక వస్తే పాలలో తడిసిన గుడ్డుపట్టి కడితే నయం అవుతుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఆవులను పెద్దసంఖ్యలో పెంచుతున్నారు. ఆయా దేశాల్లో గేదెలు ఎక్కువగా జంతు ప్రదర్శనశాలలోనే కనిపిస్తాయి. చరక సంహిత ప్రకారం జీవన శక్తి అందించే ద్రవ్యాలలో ఆవు పాలు అన్నిటికంటే శ్రేష్ఠమైనవని తెలుస్తుంది. ధన్వంతరి నిఘంటువు ప్రకారం ఆవుపాలలో రసాయనము, పథ్యము, బలవర్ధకము, హృదయానికి హితం చేకూర్చేది. మేధస్సును పెంచేది. ఆయుర్యృద్ధి, పుంసత్వం కలిగించేవి. ఇంకా వాత-పిత్త-కఫాలను రూపుమాపే గుణాలు ఆవుపాలలో ఉన్నాయి.
తెల్ల ఆవుపాలు వాతాన్ని నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని , ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరించివేస్తాయి. కపిల గోవు ఈ దృష్టిలో ఎంతో ఉపయోగకరమైనది. ఆవుపాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు. అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. గ్రామాల్లో ఆవు పాలు తాగే 80 ఏళ్ల వృద్ధులు చాలా మంది కళ్ళద్దాలు ఎరుగరు. ఎందుకంటే వారు చిన్నతనం నుంచి ఆవు పాలు మాత్రమే తాగుతూ వస్తున్నారు. ఈ విషయం నాడెప్ కాకా అనే పెద్దయాన స్వయంగా చెప్పారు.