ఆయన సెలబ్రిటీ ల దగ్గర నుంచీ మామూలు సామాన్యుల వరకూ అందరికీ జాతకాలు చెబుతారు. ఒక మనిషి జాతకం చూసి చెప్పి వారి యొక్క భవిష్యత్తు ని నిర్ణయించడం లో దిట్ట ఈయన. అయితే హోమాలు , యజ్ఞాలు అంటూ ఆడవారికి లైంగికంగా దగ్గర అవుతున్నారు అంటూ నకిలీ స్వామీ వెంకట లక్ష్మి నరసింహ ని అరెస్ట్ చేసారు పోలీసులు.
ఖమ్మం జిల్లా గుడి మెట్ల ప్రాంతం నుంచి హైదరాబాద్ వనస్థలి పురం లో మకాం పెట్టిన అతను పదవ తరగతి వరకే చదువుకున్నాడు. జ్యోతిష్యంలో మెలకువలు నేర్చుకుని, అమీర్ పేటలోని గాయత్రీనగర్ లో ‘భవిష్య వాణి’ పేరిట కార్యాలయం ప్రారంభించాడు.పేరుమోసిన జ్యోతిష్యుడినని చెప్పుకుంటూ కొన్ని టీవీ ఛానెళ్లలో జ్యోతిష్య కార్యక్రమాలు కూడా నిర్వహించాడు.
దీంతో కావాల్సిన ప్రచారం లభించింది. విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరుల్లో కొత్త కార్యాలయాలు తెరిచాడు. సమస్య ఏదైనా కూడా ఒకే ఒక్క హోమం తో మొత్తం కష్టాలు పోగొడతాడు.
లక్షలాది రూపాయలు కాజేయడమే కాకుండా మహిళల ని లైంగికంగా లోబరుచుకోవడం కూడా అతనికి ఒక హాబీ.టీవీ లలో కూడా జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు. అతనికి డబ్బులు ఇచ్చిన వారికి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తామిచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు . అలా విషయం బయట పడింది.