తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను నేడు తితిదే విడుదల చేయనుంది. జనవరి కోటాకు సంబంధించి ఆన్లైన్ కొనుగోలు, ఎలక్ట్రానిక్ లాటరీ ద్వారా కేటాయింపు టిక్కెట్లను జారీ చేయనుంది.
ఆన్లైన్లో కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్ల కొనుగోలు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ లాటరీ కింద సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను జారీ చేస్తుంది.
వీటి కోసం వారం రోజుల పాటు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అనంతరం లాటరీ ద్వారా భక్తులను ఎంపిక చేసి టిక్కెట్లను కేటాయిస్తుంది. టిక్కెట్లకు నగదును ఆన్లైన్లో చెల్లించాలి.