ఈ మాట వింటుంటే కాస్త విడ్డూరంగా ఉన్నా ప్రముఖ పత్రిక ముంబై మిర్రర్ పేర్కొన్న వార్త చూస్తే మాత్రం నిజమే అనిపిస్తుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్నటివరకు ఎక్కడికెళ్లినా కూడా జంటగా కనిపించిన వీరు.. ఈ మధ్య జంటగా కనిపించడం లేదు. పైగా ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టపడటంలేదు. అయితే వీరిద్దరి మద్య మనస్పర్ధలు వచ్చాయని తమ ప్రేమకు  బ్రేకప్ చెప్పీనట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా కోహ్లి తాను ప్రస్తుతం సోలో అంటూ సంబరపడిపోతున్నాడంటూ ప్రముఖ పత్రిక ముంబై మిర్రర్ పేర్కొంది. ప్రస్తుతం అనుష్క సల్మాన్ తో ‘సుల్తాన్’ షూటింగ్ లో తీరిక లేకుండా గడుపుతోందని ముంబై మిర్రర్ కథనం ప్రచురించింది. ఇటీవలే ఓ వేడుకలో పాల్గొన్న విరాట్ కోహ్లి తన సన్నిహితులతో ఉత్సాహంగా కనిపించాడట. ఇదే సమయంలో తన అత్యంత సన్నిహితులతో ‘ఇప్పుడు నేను ఒంటరిని.. ఛలో డాన్స్ చేద్దాం రండి’ అంటూ పిలిచాడట కోహ్లి. కోహ్లి మాటలకు అక్కడివారంతా అనుష్కతో బ్రేకప్ వార్తలు నిజమేనని నిర్దారించుకున్నారట.

కోహ్లీ, అనుష్క శర్మ


అంతే కాకుండా ఆ మద్య కోహ్లీ తన ప్రేయసి అనుష్క తో పెళ్లి ప్రస్తావన తీసుకు రావడం ఆమె సున్నితంగా తిరస్కరించడం కూడా ఒక కారణమని తెలుస్తుంది.  ఇదిలా వుంటే ఈ ప్రేమికుల రోజును అనుష్కతో సరదాగా గడిపేందుకు కోహ్లి శ్రీలంక టీట్వంటీ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వీరిద్దరి బ్రేకప్ వార్తలు వాస్తవమేనని అందరూ భావిస్తున్నారు. మరి ఈ వార్తలపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: