దేశం గర్వించదగ్గ ప్రముఖ అథ్లెట్ అంజూ బీ జార్జీకి కేరళ క్రీడా శాఖ మంత్రి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ప్రోత్సహించాల్సిన క్రీడా శాఖ మంత్రి నుంచే వేధింపులు ఎదురవడంతో షాక్ తిన్న అంజూ... విషయాన్ని నేరుగా కేరళ సీఎం పినరయి విజయన్ కు ఫిర్యాదు చేసింది. కేరళ క్రీడల మండలి అధ్యక్షురాలిగా అంజూ చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊమెన్ చాందీ సర్కారు దిగిపోగా... పినరయి విజయన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.


ఈ నేపథ్యంలో విజయన్ కేబినెట్ లో క్రీడా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన ఈపీ జయరామన్ ను అంజూ జార్జి మండలి సభ్యులతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసింది.  తొలిసారి జరిగిన సమావేశంలోనే క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్ తనను, తనతోపాటు ఉన్న ఇతర సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. ప్రస్తుతం అంజూ కేరళ క్రీడల మండలి అధ్యక్షురాలిగా ఉన్నారు.


అయితే వారిని ప్రతిపక్షానికి మద్ధతుదారులని తిట్టారని, మున్ముందు తమ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బెంగళూరు నుంచి కేరళకు అంజూ విమానంలో ప్రయాణించారంట. అయితే, ఈ కారణంతో ఆమె.. తన కౌన్సిల్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని, అయితే, తమకు ట్రావెల్ అలవెన్సులు ఆర్థికశాఖ మంజూరు చేసిందని ఆమె చెప్పారు. డా శాఖ మంత్రి వరుస వేధింపులతో మనసు నొచ్చుకున్న అంజూ నేరుగా విజయన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అంజూ వాదనను పూర్తిగా విన్న విజయన్ దీనిపై తాను పరిశీలన చేసి చర్యలు తీసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: