తెలుగు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తను ఎన్నాళ్ల నుండో తన స్నేహితురాలు శ్రీలక్ష్మితో తన మనసులోని మాటను చెప్పాలని చెప్పలేకపోయాడు. స్పెయిన్ లో డెవిస్ కప్ కు బయలు దేరే క్రమంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన విందులో సాకేత్ తన మనసులోని మాటను ఆమెకు చెప్పేశాడట. సీనియర్ ఆటగాళ్లందరు చూస్తుండగా సాకేత్ శ్రీలక్ష్మికి ప్రపోజ్ చేసినట్టు తెలుస్తుంది.

 

లియాండర్ పేస్ కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీలక్ష్మి కూడా సాకేత్ చేసిన ప్రపోజల్స్ కు పాజిటివ్ గానే స్పందించినదట. ఇక అక్కడే చక చకా కేక్ కటింగ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటుచేశారట. అయితే తన పార్ట్ నర్ లైఫ్ లో జరిగిన ఈ స్వీట్ మెమొరీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు లియాండర్ పేస్. తన సమక్షంలో తొలి లవ్ ప్రపోజల్ అంటూ లియాండర్ పేస్ ఆ పిక్ కామెంట్ పెట్టడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: