క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ క్రీడాకారులు రోహిత్ శర్మ, అంజిక్య రహనేలకు భారత ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. అయితే ఆగష్టు 29న జరిగిన ఈ కార్యక్రమంలో వారు విదేశీ పర్యటనలో ఉండటంతో తిరిగి వచ్చిన వీరికి అర్జున అవార్డులను అందించారు. క్రీడా శాఖా మంత్రి విజయ్ గోయల్ ఈ పతకాలను వారికి అందించారు.

 

అర్జున అవార్డులతో పాటు 5 లక్షల నగదు బహుమతిని కూడా ఇద్దరికి అందించింది ప్రభుత్వం. ఇక జట్టులో కీలక ఆటగాళ్లుగా రానిస్తున్న రోహిత్, రహానేలకు ఈ అవార్డ్ ఓ గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కీలక సమయాల్లో జట్టుని ఆదుకుంటున్న ఈ ఇద్దరి ఆటగాళ్ల శ్రమకు ఈ అర్జున అవార్డ్ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: