ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ మూడో సీజన్ ఈరోజు అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. అసోం రాజధాని గౌహతిలోని ఇందిరా గాంధి అథ్లెటిక్ స్టేడియంలో ఐఎస్ఎల్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫుట్ బాల్ మీద ఉన్న క్రేజ్ ను ఇంకాస్త పెంచే ప్రయత్నంలో ఈ ఇండియన్ సూపర్ లీగ్ నిర్వహించబడుతుంది. ప్రారంభ వేడుకలు ఆకాశాన్నంటే బాణాసంచాలతో లేజర్ షోలతో ఈవెంట్ గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. 


మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ లో టోటల్ 14 జట్లు పాల్గొననున్నాయి. మొదటి మ్యాచ్ ఈరోజు సాయంత్రం నార్త్ ఈస్ట్ యునైటెడ్ తో కేరళ బ్లాస్టర్స్ జట్టు పోటీ పడనుంది. ఈరోజు మొదలైనె ఈ టోర్ని డిసెంబర్ 18 దాకా జరుగుతాయి. కేరళ బ్లాస్టర్స్ జట్టుకి సచిన్ టెండుల్కర్, నాగార్జున, చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వామ్యంగా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: