భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు అద్భుతాలు జరిగాయి. ఓ విధంగా చెప్పాలంటే నాలుగో రోజు టీం ఇండియా పూర్తి పైచేయి సాధించిందని చెప్పొచ్చు. 360/6 ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు మ్యాచ్ ప్రారంభించిన టీం ఇండియా పూజారా డబుల్ సెంచరీ సాహా సెంచరీతో పాటుగా జడేజా హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.    


ఫైనల్ గా 210 ఓవర్లకు 603 పరుగులకు డిక్లేర్ చేసింది టీం ఇండియా. ఇక సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 27 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లు జడేజానే చేయడం విశేషం. ఇక అసలు రిజల్ట్ ఏంటి అన్నది ఐదో రోజు జరుగనున్న మ్యాచ్ లో తేలనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: