మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో పోటీ పడి మరి గెలిచిన పూణె ఈసారి సీజన్ లో ఉతికారేస్తారు అనుకున్నారు. కాని ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం మొదటి మ్యాచ్ ఒక్కటే వీరు గెలిచారు. ఈరోజు గుజరాత్ లయన్స్ తో తలపడిన రైసింగ్ పూణె జట్టు మళ్లీ ఓటమిని చవిచూసింది. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోగా మొదట బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులను చేసింది. ఓపెనర్ రహనే డకౌట్ అవగా.. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (33)తో కలిసి కెప్టెన్ స్టీవ్ స్మిత్ (43) జట్టు స్కోర్ ను పెంచారు. ధోని 5 పరుగులకే అవుట్ అవగా మనోజ్ తివారి 31, అంకిత్ శర్మ 25 పరుగులు చేశారు.


ఇక 20 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ జట్టు ముందునుండి ఎటాకింగ్ ఆట ప్రదర్శించింది. ఓపెనర్లు స్మిత్ 47, మెక్కల్లం 49 పరుగులు చేయగా సురేష్ రైనా అజేయంగా 35, ఫించ్ 33 పరుగులతో పూణెను 7 వికెట్ల తేడాతో ఓడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: