ఐపిఎల్ చరిత్రలోనే బెంగళూరు జట్టు అతి చెత్త రికార్డ్ సొంతం చేసుకుంది. 2013లో పూణె వారియర్స్ మీద 263 పరుగులు సాధించిన రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు 2017 సీజన్లో అత్యల్ప స్కోర్ చేసిన టీంగా చెత్త రికార్డ్ సొంతం చేసుకుంది. నిన్న జరిగిన కలకత్తా మ్యాచ్ లో ఆర్సిబి 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది.    


ఇక నెటిజెన్లు ఆర్సిబి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో అయితే ఆ జట్టు మీద విమర్శలు కురిపించారు. 70189820250 ఇది ఆర్సిబి కొత్త టోల్ నెంబర్ అని ఆ జట్టు బ్యాట్స్ మన్ సాధించిన పరుగులను టోన్ నెంబర్ గా పెట్టేశారు. ఇక సన్ రైజర్స్ మీద ధోని సాధించిన 61 పరుగుల కంటే తక్కువగా ఆర్సిబి ఆలౌట్ అయ్యింది. ప్లేయింగ్ బోల్డ్ గా ఉన్న ఆర్సిబి క్యాప్షన్ ను ప్లేయింగ్ బౌల్డ్ గా మర్చుకోవాలంటూ కొన్ని విమర్శలు వచ్చాయి.


డ్రసింగ్ రూం నుండి కొహ్లి మ్యాచ్ పది ఓవర్లలో ఫినిష్ చేయాలని అనగా అలాగే కెప్టెన్ అని జట్టు మొత్తం 9.4 ఓవర్లలో ఆలౌట్ అయ్యారు. ఇక సచిన్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లాలి. 10 ఓవర్లు ముగిసేలోగా ఆటగాళ్లు అవుట్ అవండని కొహ్లి ఆటగాళ్లను సూచించాడని అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: