ఐపిఎల్ పదో సీజన్ లో ఘోర వైఫల్యం అవుతున్న ఆర్సిబి జట్టుకు మరో షాక్ తగిలింది. ఈరోజు జరగాల్సిన సన్ రైజర్స్ మ్యాచ్ లో సత్తా చాటుదాం అనుకున్న బెంగళూరు ఆశలకు వర్షం అడ్డంగా నిలిచింది. ఆర్సిబి వర్సెస్ ఎస్.ఆర్.హెచ్ మ్యాచ్ కనీసం టాస్ కూడా వేయకుండా మ్యాచ్ రద్దయింది.


ఐదు ఓవర్ల మ్యాచ్ జరిపేందుకు కూడా వీలు లేకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 పాయింట్లతో సన్ రైజర్స్ మూడో స్థానంలో ఉండగా.. ఆర్సిబి 5 పాయింట్లతో 6 స్థానంలో ఉంది. మ్యాచ్ రద్దవడంతో ఆర్సిబి కెప్టెన్ విరాట్ కొహ్లి షాక్ అయ్యాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: