ఈ వారాంతం లో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకి అద్భుత అనుభూతిని ఇవ్వబోతోంది అని చెప్పేయచ్చు. నిన్న జరిగిన ఇంగ్లాండ్ - పాకిస్తాన్ సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ సునాయాసం గా ఇంగ్లాండ్ మీద గేలిచేసి ఫైనల్ కి చేరుకుంది. లీగ్ మ్యాచ్ లో ఇండియా చేతిలో ఓడిపోయి ఆ తరవాత సౌత్ ఆఫ్రికా , శ్రీలంక ల మీద గెలిచిన పాక్ సెమీస్ లో ఇంగ్లాండ్ ని చిత్తు చేసింది.


ఇవాళ బంగ్లాదేశ్ - ఇండియా మ్యాచ్ జరగబోతోంది, ఇది సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్ ఫేవరేట్ గా కనిపిస్తూ ఫైనల్ కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగ్లా టీం మీద పూర్తి స్థాయి లో ఆధిపత్యం ప్రదర్శించే ఛాన్స్ కోసం ఇండియా ఎదురుచూస్తోంది. ఈ లెక్కన అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ లో కలవచ్చు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎలాంటి సంచలనాలు నమోదు కాని పక్షంలో రెండవ సెమీస్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా విజయం సాధించడం తధ్యం గనుక… ఫైనల్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయని క్రికెట్ ప్రేమికులు ఇప్పటినుండే పండగ చేసుకుంటున్నారు.


పదేళ్ళ క్రితం ఉత్కంట గా జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అందరికీ గుర్తున్నదే .. ఈ మ్యాచ్ విజయం తో భారతీయుల సంబరాలు అంబరాన్ని అంటాయి , ఇక అలాంటి ఆసక్తికర ఫైనల్ కి మనం సిద్దం అయిపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: