ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాల్సింది. 180 పరుగుల తేడాతో ఓడిన టీం ఇండియాపై మండిపాటుని చూపిస్తూ హరిద్వార్ లో టివిలు బద్ధలు కొట్టారు. టివిలు పగలగొట్టి మరి తమ నిరసనలు తెలియ చేశారు. ఇక మ్యాచ్ ఓడడంతోనే చాలా చోట్ల టీం ఇండియా ఫ్లెక్సీలను తగులపెట్టారు.


ఓ పక్క టీం ఇండియా మాజి కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విరాట్ సారధ్యంలో గెలవక తప్పని దాయాదుల పోరులో టీం ఇండియా చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 4 వికెట్లకు 338 పరుగులు చేయగా.. భారత జట్టు 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో భారత జట్టు విఫలమయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: