త్వరలో శ్రీలంకతో జరుగనున్న మూడు టెస్టుల సీరీస్ కు టీం ఇండియా తుది జట్టు ప్రకటించారు. ఇక ఈ టెస్ట్ లో ఓపెనర్ మురళి విజయ్ దూరమవనున్నాడు. మణికట్టు గాయంతో బాధపడుతున్న విజయ్ ను పక్కన పెట్టి అతని ప్లేస్ లో శిఖర్ థావన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆసీస్ సీరీస్ లో మణికట్టుకి గాయమవడంతో కొద్దిరోజులు విశాంత్రి తీసుకున్న విజయ్ సన్నాహక మ్యాచ్ లో మళ్లీ నూపితో బాధపడ్డాడు.


ఇక బిసిసిఐ వైద్యులు ఇంకా విశాంత్రి అవసరమే అని చెప్పడంతో మురళిని సీరీస్ నుండి తప్పించారు. జూలై 26న తొలి టెస్ట్ ఆగాష్టు 20 నుండి వన్ డే సీరీస్ లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 6న ఒకే ఒక్క టి20 మ్యాచ్ జరుగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: