ప్రో కబడ్డి లీగ్ ఐదో సీజన్ లో మొదట మ్యాచ్ గెలిచి శుభారంభం పలికిన తెలుగు టైటాన్స్ జట్టు ఆ తర్వాత ఆ ఫాం కొనసాగించడంలో వెనుకపడింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిన తెలుగు టైటాన్స్ జట్టు జరిగిన యూపి యోధాన్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. ఈ సీజన్ లో కొత్త జట్టైన యూపి యోథాన్ పై 18-31 తేడాతో ఘోరంగా అపజయ పాలైంది తెలుగు టైటాన్స్ జట్టు.


ప్రధమార్ధం కాస్త పోటాపోటీగా సాగినట్టు కనిపించినా ద్వితియార్ధంలో మాత్రం యూపి యోధాన్ జట్టు తెలుగు టైటాన్స్ కు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగు టైటాన్స్ జట్టు కెప్టెన్ రాహుల్ చౌదరి 7 రైడ్ పాయింట్స్ తో పోరాడినా లాభం లేకుండా పోయింది. ఇక అంతకుముందే జరిగిన మ్యాచ్ లో గుజరాత్ దిల్లి మ్యాచ్ లలో దిల్లి పై 26-20తేడాతో గెలిచింది గుజరాత్.



మరింత సమాచారం తెలుసుకోండి: