ప్రో కబడ్డిలీగ్ 5వ సీజన్ లో మొదటి మ్యాచ్ మురిపించిన తెలుగు టైటాన్స్ జట్టు ఆ తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లు ఓటమి పాలైంది. ఈరోజు జరిగిన బెంగాల్ వారియర్స్ తో 24-30 తేడాతో ఓడిపోయింది తెలుగు టైటాన్స్ జట్టు. ప్రధమార్గంలో పోటాపోటీగా సాగినా ద్వితియార్ధంలో బెంగాల్ వారియర్ మ్యాచ్ పై పట్టు సాధించారు. 


తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి చాలా సేపు బయటే ఉండటంతో గెలుపు అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. ప్రత్యర్ధి రైడర్లను పట్టడంలో విఫలమైన టైటాన్స్ జట్టు ఫలితంగా మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమితో వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓటమి చవి చూసింది తెలుగు టైటాన్స్ జట్టు.



మరింత సమాచారం తెలుసుకోండి: