శ్రీలంక పై జరిగే ఐదు వన్డేల సీరీస్ కు విరాట్ కొహ్లి దూరం అవుతున్నాడట. వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న కొంతమంది ఆటగాళ్లకు బిసిసిఐ విశాంత్రి అవసరమని గుర్తించి వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకుంటుందట. జట్టు సభ్యుల్లోనే వారిని కాకుండా మిగతా వారిని ఆడించే అవకాశం కలిగిస్తారట. విరాట్ కొహ్లి, రవింద్ర జడేజా, ఉమేష్ యాదవ్, అశ్విన్, మహ్మద్ షమిలకు వన్డే సీరీస్ లో విశ్రాంతి ఇస్తున్నారట.


ఐపిఎల్ నుండి చాంపియన్స్ ట్రోఫీ ఆ తర్వాత వెస్టిండీస్ అటు నుండి అటే శ్రీలంక ఇలా వరుసగా మ్యాచులను ఆడుతున్న కొంతమంది ఆటగాళ్లకు కాస్త రిలీఫ్ అవసరమని నిర్ణయించారు. ఇక శ్రీలంకతో టీం ఇండియాకు తాత్కాలిక కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తారని తెలుస్తుంది. ఇక జట్టులో కొత్తవారైన అక్షర్ పటేల్, చాహల్, కులదీప్ యాదవ్, బసిల్ థంపిలను తీసుకునే అవకాశం ఉందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: