ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పివి.సింధు, సైనా నెహ్వాల్ లు రజత, కాస్య పతకాలను గెలుచుకున్నారు. వీరి విజాయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ దేశం గర్విస్తుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. సింధు, సైనా లను ప్రత్యేకంగా అభినందించారు. ఇక ప్రధాని నరేంద్త్ర మోది కూడా సింధు, సైనాల పతకాలను గెలవడం చూసి దేశం గర్విస్తుందని ట్వీట్ చేశారు. 


ఇక వీరు సాధించిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పతకాలకు కానుకగా బ్యాండ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింధుకు 10 లక్షలు, సైనాకు 5 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. మంచి ఫాంలో ఉన్న సింధు, సైనాలు మరెన్నో విజయాలను అందుకునేలా ఈ బహుమతులు ప్రోత్సహాన్ని అందిస్తాయని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: