శ్రీలంకతో జరిగిన అన్ని ఫార్మెట్ ల మ్యాచులలో ఓడించిన టీం ఇండియా అరుదైన చరిత్రను సృష్టించింది. ఆతిధ్య జట్టుని కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవనివ్వకుండా 9-0తో సీరీస్ క్లీన్ స్వీప్ చేయడం అంటే అది చరిత్రలో గొప్ప విషయమని చెప్పాలి. భారత జట్టు సాధించిన ఈ విజయం ఎంతో గొప్పది. శ్రీలంకను టెస్ట్, వన్ డే, టి20 ఇలా 3 ఫార్మెట్ లలో ఓడించి చరిత్రకు శ్రీకారం చుట్టింది.


ఇక నిన్న జరిగిన టి20 మ్యాచ్ లో కూడా భారత జట్టు శ్రీలంక మీద సునాయాస విజయం అందుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లకు 170 పరుగులు చేయగా ఆ తర్వాత లక్ష్య చేధనలో దిగిన భారత జట్టు 4 బాల్స్ ఉండగానే 4 వికెట్లు కోల్పోయి నిర్ణీత లక్ష్యాన్ని చేధించింది. ఇక శ్రీలంక టూర్ లో 5 టెస్ట్, 3 వన్ డే, 1టి20 ఇలా అన్ని ఫార్మెట్ లలో శ్రీలంకను చిత్తుచేసి భారత జట్టు విజయ పతాకం ఎగురవేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: