కెప్టెన్ గా ఇండియాకు ఎన్నో రికార్డ్ విక్టరీలను అందించిన ఎమ్మెస్ ధోని ఇప్పుడు గంగూలి రికార్డును బ్రేక్ చేయబోతున్నాడు. ప్రస్తుతం 310వన్డేలు ఆడిన ధోని మొహాలిలో ఈరోజు జరిగే వన్డేతో 311 వ మ్యాచ్ ఆడుతున్నాడు. గంగూలి తన కెరియర్ 311 వన్ డేలు ఆడాడు. ఆ రికార్డుని సమం చేస్తున్నాడు ధోని. ఇక శ్రీలంకతో జరిగే 3వ వన్డే వైజాగ్ లో జరుగనుంది. 


ఆ మ్యాచ్ తో ధోని గంగూలి రికార్డ్ సైతం బ్రేక్ చేసి 312 మ్యాచ్ లను పూర్తి చేసుకుంటాడు. ఇక శ్రీలంకతో జరిగిన మొదటి వన్ డేలో 65 పరుగులను చేసిన ధోని తన సత్తా చాటాడు. ఇక ఆ మ్యాచ్ లో 16000 ల మైలు రాయిని దాటాడు ధోని. ఇక వన్డేల్లో ఇండియా తరపున అత్యధిక మ్యాచ్ లను ఆడిన వారి లిస్ట్ చూస్తే సచిన్ 463, రాహుల్ ద్రావిడ్ 344, మహ్మద్ అజహరుద్దిన్ 334 వన్ డేలు ఆడారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: