రావడం రావడమే రిలయన్స్ జియో సంచలన ఆఫర్ లతో అందరినీ ముంచెత్తింది. నిత్యం ప్రకటనల తో దేశం లో యావన్మందీ తమ సిం వాడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ.తాజాగా మరోమారు ఇతర కంపెనీలను దెబ్బ కొట్టే వ్యూహంతో ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. జియో కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు త్వరలో 5జీ సేవలను అందించేందుకు సమాయత్తమవుతోంది.
అంతేకాదు 5 జీ స్మార్ట్ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. అదే జరిగితే ఇతర టెలికం కంపెనీలు కుదేలవక తప్పదు. 5 జీ సర్వీసులతోపాటు జియో టీవీ అనే కొత్త సర్వీస్ను కూడా తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. డీటీహెచ్ సర్వీస్ అయిన దీని ద్వారా అతి తక్కువ ధరతో 360కి పైగా చానల్స్ను చూడవచ్చని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న విషయాన్ని చెప్పనప్పటికీ నార్మల్ టీవీ నుంచి స్మార్ట్ టీవీకి మారేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.