చైనా సెల్ ఫోన్ దిగ్గజం షియామీ మరొక కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో విడుదల చేసింది. షియామీ రెడ్ మీ నోట్ 4 తో చైనా లో ఈ ఫోన్ గత ఆగస్ట్ లో విడుదల అయ్యింది. తాజాగా భారత్ మార్కెట్ లో విడుదల అయిన స్మార్ట్ ఫోన్ యూజర్ లని విపరీతంగా ఆకర్షిస్తోంది. గోల్డ్,  బ్లాక్  సిల్వర్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వీటి ధ‌ర‌లు రూ. 9,999(2జీబీ), రూ.10,999 (3 జీబీ), రూ. 12, 999 (4జీబీ) గా ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్‌లు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి.వీటి ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. 2.5డి కర్వ్‌డ్ గ్లాస్‌తో 5.5  ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే(రిజల్యూషన్ 1080x1920 పిక్సెల్స్), డెకాకోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్ ఉన్నాయి.13 మెగాపిక్సెల్ కెమెరా, f/2.0 అపెర్చ్యూర్, డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు 85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ ముందు కెమెరా 2జీబీ/3జీబీ ర్యామ్, 16జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్నాయి. మైక్రోఎస్డీతో 128జీబీ వరకు పెంచుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రార్డ్ సెన్సార్ ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: