రిలయన్స్ జియో నెట్వర్క్ లో సెకను కి దాదాపు కొత్త గా ఏడుగురు చేరుతున్నారు అని రిలయన్స్ ఇండస్ట్రీస్ హెడ్ ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు. జియో వినియోగదారుల సంఖ్య పదికోట్లకు చేరుకున్న సందర్భంగా ముంబైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ జియో గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జియోను ప్రారంభించిన 170 రోజుల్లోనే పదికోట్ల మందికి పైగా వినియోగదారులు చేరినట్టు తెలిపారు. మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు.  జియో నెట్‌వర్క్ ద్వారా రోజుకు 5.5 కోట్ల గంటల వీడియోలను వినియోగదారులు చూస్తున్నట్టు తెలిపారు. అలాగే రోజుకు 200 కోట్ల నిమిషాల వాయిస్, వీడియో కాల్స్ వెళ్తున్నట్టు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: