జియో ఆఫర్ ల దెబ్బకి కొత్త కొత్త ఆఫర్ లతో ఎయిర్టెల్ కూడా తప్పక కౌంటర్ ఇవ్వాల్సి వస్తోంది.తాజాగా జియో ధ‌న్ ధ‌నాధ‌న్ పేరుతో కొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టిస్తూ ఆఫ‌ర్ల తుపానుని ఆప‌కుండా ముందుకు వెళుతున్న నేప‌థ్యంలో ఎయిర్‌టెల్ కూడా ధ‌న్ ధ‌నాధ‌న్ ఆఫ‌ర్‌కు పోటీగా అదే స్థాయి సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఒకదాన్ని ప్రకటించబోతోంది. ఈ కొత్త ప్లాన్‌ ప్రకారం 4జీ వినియోగ‌దారులు రూ.399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా, అప‌రిమిత కాల్స్ పొంద‌వ‌చ్చ‌ని ప్రముఖ టెలికం బ్లాగర్‌ సంజయ్‌ బఫ్నా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: