భారత్‌లో షావోమికి చెందిన హాట్‌కేకులా అమ్ముడుపోతున్న రెడ్‌మి నోట్‌ 4 ధర శాశ్వతంగా తగ్గింది. దీంతో రెడ్‌ నోట్‌4 ధర భారత్‌లో రూ.9999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ విషయాన్ని షావోమి ఇండియా అదినేత మను కుమార్‌ జైన్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ మేరకు  '' భారత్‌లో నెంబర్‌ 1 అమ్మకపు స్మార్ట్‌ఫోన్‌గా ఉన్న రెడ్‌మి నోట్‌ 4 ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు మేము ప్రకటిస్తున్నాం'' అని జైన్‌ ట్వీట్‌ చేశారు.   ఈ ధర తగ్గింపుతో మోటో జీ5, నోకియా 5, శాంసంగ్‌ గెలాక్సీ జే7 మోడల్స్‌కు ఇది గట్టి పోటీగా నిలువనుంది.


రెడ్‌మి నోట్‌ 4 స్పెషిఫికేషన్లు :

5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే

2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌

ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ

128జీబీ వరకు విస్తరణ మెమరీ

13 ఎంపీ బ్యాక్‌ కెమెరా

5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

బ్లాక్‌, డార్క్‌ గ్రే, గోల్డ్‌ రంగుల్లో ఇది అందుబాటు


మరింత సమాచారం తెలుసుకోండి: