తయారు చేయువిధానం : బాండీలో నూనె వేసి, కొద్దిగా నెయ్యి కూడా జత కలిపి జీలకర్ర వేసి వేయించండి. ఆపై వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి వేయించండి. ఉల్లిపాయులు దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టొమోటాలను వేయండి. పెసరపప్పుకు నీళ్లు జత చేసి ఉడికించాలి విడిగా.. పప్పు రెడీ అయ్యాక వేయించినవన్నీ వెల్లుల్లి, ఉల్లిపాయ, టొమోటోల ముక్కలను పప్పులోవేయండి.
ఉప్పు, గరంమసాలా పొడితో పాటు పసుపు చల్లి బాగా కలియబెట్టండి కొంతసేపు ఉడికించాక చూడండి. పప్పు రెడీ అయినదీ, లేనిది తెలస్తుంది. ఓకే అనుకుంటే పొయ్యి మీద నుంచి దించి పైన చక్కగా కొత్తిమీర చల్లి నిమ్మకాయ రసం చల్లండి.. మూతపెట్టి ఓ రెండు నిమిషాలాగి భోజనానికి ఉపక్రమించండి. వేడిగా భావుంటుంది.