రాత్రి నిద్రపోయేముందు నెయ్యిని ముఖానికి బాగా పట్టించి మర్ధనం చేసి ఉదయం కడుక్కోండి. ఇలా చేస్తే మీ ముఖానికి మంచి రంగు రావడంతో పాటు నునుపుదనంతో అందంగా, ఆకర్షణీయంగా కనపడుతారు. మీ శరీరం కాంతితో విలసిల్లలంటే రోజు రెండు ముల్లంగి దుంపలు తినండి. రోజుకు రెండు దుంపలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పచ్చివి తింటూవుంటే మీ శరీరకాంతి పెరుగుతూ ఆరోగ్యంగా ఉంటారు. మెంతులు బాగా నూరి ముఖానికి మర్దన చేసుకుని, గంట తర్వాత స్నానం చేస్తే ముఖం చాలా మృదువుగా, అందంగా ఉంటుంది. పాదాలకు నిమ్మరసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే పాదాలకు అంటుకున్న మురికిపోయి శుభ్రంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: