రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్థికమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పధార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులను తినడంతో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించిన పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లైతే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది. రాగులలో కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధమేహ వ్యాధికి రాగులలో చేసిన ఆహార పధార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారు చేసిన ఆహారం పధార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: