బ్యూటీషియన్ శిరీష కేసు లో మొట్టమొదటి సారి ఈ కేసు తో ఇన్ డైరెక్ట్ సంబంధం ఉన్న తేజస్విని మాట్లాడింది. ఆమె తన తరఫున పోలీసులకి మరొక్కసారి వాంగ్మూలం ఇచ్చింది. శిరీష ఆత్మహత్య తనని చాలా బాధించింది అనీ ఈ వార్త వినగానే తాను షాక్ అయ్యాను అనీ ఆమె చెప్పుకొచ్చింది.


ఇంత చిన్న విషయానికే శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని తాను అనుకోలేదని వాంగ్మూలంలో ఆమె తెలిపింది. " నన్ను రాజీవ్ ప్రేమించాడు నేను కూడా కొన్నాళ్ళ తరవాత అతని ప్రేమని అంగీకరించాను. పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నాము మేము. కేవలం రాజీవ్ కోసమే నేను బెంగళూరు లో ఉద్యోగం మానేసి హైదరాబాద్ లో కొత్త ఉద్యోగం వెతుక్కున్నాను "అంటూ చెప్పుకొచ్చింది.


" సరిగ్గా నేను రాజీవ్ కోసం ఇదంతా చేస్తున్న టైం లో రాజీవ్ శిరీష వలలో పడ్డాడు నన్ను ఎవాయిడ్ చెయ్యడం మొదలు పెట్టాడు. అది నేను సహించలేక పోయాను. ఒకసారి అతని ఆఫీస్ కి వెళితే ఆమెని తన భార్యగా చెబుతూ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడాడు దాంతో నేను ఎదో జరుగుతోంది అని గుర్తించాను " అని తేజస్విని తెలిపింది.


ఈ నేపథ్యంలో రాజీవ్ కు తెలియకుండా శిరీషతో తాను అనేక సార్లు గొడవపడ్డానని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి తాను, శిరీష పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నామని తెలిపింది. రాజీవ్ ను పెళ్లి చేసుకుంటానని అతని తల్లిదండ్రులను కూడా అడిగానని చెప్పింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: