బుల్లితెర యాంకర్ గా మోడ్రెన్ మహాలక్ష్మి, తడాఖా, కిర్రాక్ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న యాంకర్ అనసూయకు ఒక కొత్త కోరిక పుట్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బుల్లి తెర హాట్ యాంకర్ గా ఎంతో మంది అభిమానులను ఏర్పరుచుకున్న ఈమెకు సింగర్ గా మారి ప్రేక్షకులకు షాక్ ఇవ్వాలని ఘాడమైన కోరిక పుట్టుకొచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమాలో నటించేందుకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ కొత్త కోరికను కూడ తాను నటించే సినిమాలో తీర్చుకోవడానికి అనసూయ తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తనకు పాట పాడే అవకాశం ఇవ్వాలని ఈమె అప్పుడే పలువురు సంగీత దర్శకులను కూడా సంప్రదిస్తోంది అని టాక్. ఈ మధ్య ఈ హాట్ యాంకర్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బృందంతో కలిసి అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. బహుశ దేవిశ్రీ ప్రసాద్ కు అమెరికాలో వచ్చిన క్రేజ్ చూసి అనసూయకు కుడా ఈ విచిత్ర కోరిక పుట్టి ఉండాలి. ఇప్పటికే కొన్నిపత్రికలలో అనసూయ తాను నటించ బోయే సినిమానిర్మాతను కోటి రూపాయల పారితోషికం అడిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మరి పాటలు పాడడానికి ఈమె ఎంత డిమాండ్ చేస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: