ప్రపంచంలో అతిపెద్ద మోటార్ కంపెనీ అయిన హీరో మోటో కార్ప్ నుండి మరో రెండు ఖరీదైన మోటర్ సైకిళ్లను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. హీరో నుండి సరికొత్తగా ఎక్స్ ట్రీం 200ఆర్, ఎక్స్ పల్స్ 200 బైకులను లాంచ్ చేయనుంది. ఇవే కాకుండా కొత్తగా మరో రెండు ప్రీమియం బైకులను రిలీజ్ చేయనున్నారు. 200 సిసి ఇంజిన్ కెపాసిటీతో ఈ బైకులు రాబోతున్నాయి.


18 బిహెచ్పి పవర్, 17 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేసేలా అందుబాటులో ఉన్నాయి. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ బైక్ అనుసంధానం కలిగి ఉంది. ఇక 125 సిసి కెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్న బైకుల్లో ఏ.బి.ఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం) తప్పనిసరి చేసింది. అందుకే రాబోతున్న ఈ రెండు మోడల్ బైకులలో కూడా ఏ.బి.ఎస్ తో కూడా అందుబాటులో ఉంటుంది. 


మార్కెట్ లో కొత్తగా రిలీజ్ అవబోతున్న రేసింగ్ బైకులకు పోటీగా హీరో నుండి ఈ రెండు బైకులు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. తమ ప్రత్యేకమైన కస్టమర్స్ కోసం మోటార్ హీరో అధునాతన టెక్నాలజీతో ఈ బైకులను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరలో రిలీజ్ కాబోతున్న హీరో బైకులను సొంతం చేసుకునేందుకు దగ్గరలో ఉన్న హీరో షోరూం ను సంప్రదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: