హీరో మోటో కార్ప్ నుండి వచ్చిన అత్యంత స్టైలిష్ బైక్ కరిజ్మా జెడ్.ఎం.ఆర్. రెండేళ్లుగా ఆపేసిన ఈ మోడల్ ను మళ్లీ హీరో మోటార్స్ రీ లాంచ్ చేసింది. దేశీయ అగ్రగామి మోటార్ సంస్థ అయిన హీరో మోటార్స్ మళ్లీ కరిజ్మా జెడ్.ఎం.ఆర్ ను రిలీజ్ చేస్తుంది. 2018 హీరో కరిజ్మా రిలీజ్ ఫిక్స్ అయ్యింది.


అయితే హీరో డీలర్స్ దగ్గరకు మాత్రం ఈ బైక్ ఇంకా చేరలేదు. అఫిషియల్ వెబ్ సైట్ లో మాత్రం హీరో 2018 కొత్త జెడ్.ఎం.ఆర్ ను పెట్టింది. ఇక దీని ధర 1.08 వేల రూపాయలుగా నిర్ణయించారు. కరిజ్మా జెడ్.ఎం.ఆర్ డ్యుయల్ టోన్ ధర 1.10 లక్షలు. ఢిల్లీలో జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో హీరో సరికొత్త జెడ్.ఎం.ఆర్ ను ప్రదర్శనలో ఉంచింది.


ఇక ఈమధ్యనే ఈ బైక్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. 223 సిసి కెపాసిటీ కలిగిన సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ సిస్టెంతో ఈ బైక్ వస్తుంది. 20 బి.హెచ్.పి పవర్, 19.7 టార్క్ తో ఈ బైక్ వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్సెస్ కలిగిన ఈ బైక్ గంటకు 129 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.    


మరింత సమాచారం తెలుసుకోండి: