జపాన్ దిగ్గజ మోటార్ సంస్థ కవాసకి ఇండియన్ మార్కెట్ లోకి మూడు సరికొత్త బైకులను రిలీజ్ చేయడం జరిగింది. సూపర్ బైకులుగా చెబుతున్న కవాసకి వీటిలో రేట్లతో సర్ ప్రైజ్ చేసింది. మొదటిగా కవాసకి నింజా హెచ్ 2 బైక్ ధర 34.50 లక్షలుగా నిర్ణయించబడింది. నింజా హెచ్ 2 కార్బన్ బైక్ 41 లక్షల దాకా ఫిక్స్ చేశారు.  


హెచ్ 2 ఆర్ ధర 72 లక్షలు నిర్ణయించబడింది. వీటికి చెల్లించే రేటుతో ఏకంగా లక్సరీ కార్లనే కొనేయొచ్చు కాని వీటికి ఇంత ప్రైజ్ ఎందుకుందో వాటీ ప్రత్యేకతలను చూస్తే తెలుస్తుంది. కవాసకి రిలీజ్ చేస్తున్న ఈ హెచ్ 2 సీరీస్ బైకులు 998 సిసి కెపాసిటీ కలిగి ఉంటాయి.


నాలుగు సిలిండర్లు కలిగిన లిక్విడ్ కూల్డ్ సిస్టెంతో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నాయి. 227 బి.హెచ్.పి పవర్ ఇంకా 141.7 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బైకులు సెప్టెంబర్ 1 నుండి అడ్వాన్స్ బుకింగ్ చేయబడుతున్నాయి. 2019లో వీటిని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: