దేశంలో నాటికి కరోనా పాజిటివ్ ల సంఖ్యా నానాటికి పెరిగిపోతోంది. దేశం లో ఇప్పటివరకు 7500 పాజిటివ్ కేసులు నమోదు కాగా 258 చనిపోయారు. అయితే ఒక్క మహారాష్ట్రలో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 1666 చేరుకుంది. కొత్తగా ఇవాళ మరణించిన కేసుతో కలుపుకొని మొత్తం 111 కి చేరుకుంది. అయితే గడచిన 12 గంటల్లో 92 పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం .

 

వివలలోకి వెళితే ముంబై లో ఓ వ్యక్తి కరోనా తో చనిపోయాడు. ఈ వ్యక్తి వైద్యం తీసుకొంటూ చనిపోయాడని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరణించిన వ్యక్తికీ సుమారు 82 ఏళ్ళు ఉండవని అంటున్నారు. ఆ వ్యక్తి ముంబైలోని ధారావి కి చెందిన వాడిగా గుర్తించారు. ఈ మరణం తో ధారావిలో 4 కి చేరినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా ఇళ్ళనుండి ఎవరు బయటికి రావద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జరీ చేసినందున మహారాష్ట్ర ప్రభుత్వం పహారా కట్టుదిట్టం చేస్తున్నారు  

మరింత సమాచారం తెలుసుకోండి: