ఛత్తీస్గఢ్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెం దిన 33 మంది విద్యార్థులు ఇటలీ నుంచి వచ్చి ఛత్తీస్గఢ్ బార్డర్లో ఆగిపోయారు. దీంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి జగన్తోపాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
దీంతో విద్యార్థులను క్షేమంగా ఏపీకి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలీకృతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విద్యార్థులను రాష్ట్రానికి క్షేమంగా తీసుకు వచ్చేందుకు చొరవ చూపించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబులు రం గంలోకి దిగి రాయపూర్, జగదల్పూర్ మీదుగా సోమవారం విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలుగు విద్యార్థులను ఏపీకి తీసుకు వచ్చేందుకు సహకరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు.