కరోనా మహమ్మారి ని ఎవరు ఆపలేరు అన్న చందంగా కరోనా రక్కసి విజృంభిస్తోంది. మర్కజ్ నిజాముద్దీన్ సంఘటన అనంతరం ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్ర ప్రదేశ్ లోను కరోనా కేసులు నానాటికి పెరిగి పోతున్నాయి. నిన్నటివరకు 405  కేసులు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ లో ఉందట నేడు ఆ సంఖ్యా 15 కు పెరిగింది .

 

ఈ సాయంత్రం వరకు ఆంధ్ర ప్రదేశ్ లో 15 కేసులు నమోదు కాగా అందులో 7 కేసులు గుంటూరులో , 4 కేసులు నెల్లూరు లో నమోదు కాగా కడప మరియు చిత్తూరులలో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి , అదేవిధంగా కర్నూలులో 2 కేసులు నమోదు అయ్యాయి . ఇవాళ నమోదు అయిన 15 కేసులు కలుపుకొని 420  కేసులు ఇందులో ఇప్పటివరకు 12 మంది డీఛార్జి అయ్యారు . కేవలం కర్నూలు లో 84 , గుంటూరులో 82  పాజిటివ్ కేసులు మరియు నెల్లూరు లో 54 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్యలు పెరిగే అవకాశం ఉందని హాస్పిటల్ వర్గాలు తెలుపుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: