మేడ్చ‌ల్ జిల్లాలో  దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డెంటల్ కాలేజీ డంపింగ్ యార్డు స‌మీపంలో ఇద్ద‌రు యువ‌తులు చెట్టుకు ఉరి వే సుకుని చ‌నిపోయారు. ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌రో చిన్నారి మృత‌దేహం కూడా ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.  పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని, కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

 

అయితే ఈ ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇది హ‌త్యా.. లేక ఆత్మ‌హ‌త్యా అన్న కోణంలో  పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఘ టనా స్థ‌లాన్ని గ‌మ‌నిస్తే... వీరంద‌రూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ఆత్మ‌హ‌త్య‌కు కుటుంబ క‌ల‌హాలే కా ర‌ణంగా భావిస్తున్నారు.

 

 ఘ‌ట‌నా స్థ‌లంలో కూల్‌డ్రింక్ ఉండ‌టంతో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ముందుగా చిన్నారికి కూల్ డ్రింక్‌లో మ త్తు మందు క‌లిపి చిన్నారి చ‌నిపోయిన త‌ర్వాతే ఆ ఇద్ద‌రు యువతులు ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌ని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే వీరు స్థానికులా..లేక మ‌రేదైనా రాష్ట్రానికి చెందిన వారా అనేది తెలియాల్సి  ఉంది. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: